‘సకల రంగాలను అభివృద్ధి చేయడంతోపాటు సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన బీఆర్ఎస్ వెంటే ప్రజలు ఉన్నారని, ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసినట్టే. బీజేపీ, ఇతర పార్టీల అడ్రస్ గల్లంతు అవడం ఖాయం’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో శుక్రవారం నాయీబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 43వ వార్డు కౌన్సిలర్ నామా అరుణాప్రవీణ్తోపాటు వారి అనుచరులు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మార్పును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు లేవని, నెరవేర్చలేని హామీలతో వస్తున్న విపక్షాలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 24 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో అన్ని రంగాలు ఎంతో అభివృద్ధి చెందాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గడపగడపకూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతుండటంతో ప్రజలంతా గులాబీ జెండాకు జై కొడుతున్నారని పేర్కొన్నారు. దీంతో సూర్యాపేటలో బీఆర్ఎస్ జన ప్రభంజనం కొనసాగుతున్నదని, ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసినట్టేనని చెప్పారు. బీజేపీ, ఇతర పార్టీల అడ్రస్లు గల్లంతు ఖాయమన్నారు. సూర్యాపేటలో శుక్రవారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి మంత్రి సమక్షంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా నాయీ బ్రాహ్మణులు ఏర్పాటు చేసుకొని ఆహ్వానించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 నుంచి బీఆర్ఎస్కు ఓటేసినంకనే అందరి తల రాతలు మారాయన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అరకొర సీట్లతో సరిపెట్టుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శాసన సభ ఉప ఎన్నికలన్నింటిలో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ కథ ఈ ఎన్నికలతో ముగిసినట్టేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రెండు సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ, ఎక్కడా బోణీ కొట్టని ఇతర పార్టీల అడ్రస్లు గల్లంతు కాక తప్పదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. నిరంతర విద్యుత్, తాగు, సాగునీరు, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కుల వృత్తులకు, చేతి వృత్తులకు చేయూత, సబ్సిడీ రుణాలు వంటి అనేక పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు.
అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు, అభివృద్ధి ఎందుకు లేవని ఓట్ల కోసం వస్తున్న ఆయా పార్టీల నాయకులను నిలదీయాలన్నారు. ప్రస్తుతం వారు అధికారంలో ఉండి అందించలేని పథకాలను కొత్తగా ఒక్క తెలంగాణ రాష్ర్టానికి ఇస్తామంటే నమ్ముతారా? అని ప్రశ్నించారు. మొన్న ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు, నెరవేర్చలేని హామీలను నమ్మి మోసపోయిన కర్ణాటక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వింటే తెలుస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కరెంట్ పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ మాదిరి అభివృద్ధి, సంక్షేమ పథకాలు యావత్ దేశంలోనే మరే రాష్ట్రంలో లేవన్నారు.
రెండు మార్లు బీఆర్ఎస్కు ఓటేసినంకనే అందరి తల రాతలు మారి ప్రశాంత వాతావరణంలో నిరంతర అభివృద్ధి పాలన కొనసాగుతున్నదని చెప్పారు. అందుకే సూర్యాపేటలో ప్రజలంతా గులాబీ జెండాకు జై కొడుతూ.. అడుగడుగునా మంగళ హారతులతో బ్రహ్మరథం పడుతున్నారన్నారు. స్వచ్ఛందంగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుని మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. ఇంతటి ప్రజాధరణను తట్టుకోలేకనే విపక్షాలు నెరవేర్చలేని హామీలతో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి మరోసారి గెలిపిస్తే అన్ని రంగాలను మరింత అభివృద్ధి చేసుకుందామని కోరారు.
సూర్యాపేట పట్టణంలోని 43వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నామా అరుణాప్రవీణ్, నామా సైదులు 160 మంది అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. పెన్పహాడ్ మండలం లింగాల, పెన్పహాడ్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సూర్యాపేట పట్టణం, ఆత్మకూర్ (ఎస్) మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, చిరు వ్యాపారులు, యువత పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి జగదీశ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమాల్లో ఉన్నత విద్యామండలి మాజీ సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, బీరవోలు శ్రీహర్ష, మర్ల చంద్రారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, తూడి నర్సింహారావు, మామిడి అంజయ్య, దేవరకొండ జనార్దన్, వేణు, శ్రీను, శ్రీకాంత్, సైదులు యాదవ్, తాహెర్ పాషా, ఝాన్సీ రమేశ్ పాల్గొన్నారు.