సూర్యాపేట.. ఏప్రిల్ 09 : సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆవరణలో నిర్మిస్తున్న 650 పడకల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో వైద్యాదికారులు, టీఎస్ఎంఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో నూతన భవన నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నూతన భవన నిర్మాణం ప్లానింగ్ ని పరిశీలించి ఏ అంతస్తులో ఏ డిపార్ట్మెంట్ వస్తుందో అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేసి మార్పులు కోసం టీఎస్ఎంఐడీసీ ప్రతిపాదనలు పంపాలని సూచించారు. డిపార్ట్మెంట్ వారీగా హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహిస్తూ హాస్పిటల్ కి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
తదుపరి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం పెంచి త్వరగా పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, టీఎస్ఎంఐడీసీ సీఈ దేవేందర్, ఈఈ జైపాల్ రెడ్డి, హెచ్ఓడీలు, ఏఈలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.