అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, పేదలు ఆత్మగౌరవంతో బతికేలా ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం తుర్కపల్లిలో 40, ఆత్మకూర్.ఎంలో 48 డబుల్ బెడ్రూం ఇండ్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పట్టాలు అందించి మాట్లాడారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, గ్రామాలు, పట్టణాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు.
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 12 : సీఎం కేసీఆర్ సంకల్పంతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నిర్మించిన 48 డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. వారం రోజుల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిసర ప్రాంతాల్లో అన్ని సౌకరాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తండా మంగమ్మాశ్రీశైలంగౌడ్, జడ్పీటీసీ కె.నరేందర్గుప్తా, తాసీల్దార్ జయమ్మ, ఆర్అండ్బీ ఈఈ శంకరయ్య, డీఈ శాహనబేగం, ఎంపీడీఓ యాదగిరి, సర్పంచ్ జన్నాయికొడె నగేశ్, ఎంపీటీసీ యాస కవిత, ఆర్ఐ యాదగిరి పాల్గొన్నారు.
తుర్కపల్లిలో 40ఇండ్లు ప్రారంభం
తుర్కపల్లి : సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆమె మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రారంభించడంతో పాటు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందించారు. అంతకుముందు మహిళలు ప్రభుత్వ విప్కు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మించిన 40డబుల్ బెడ్రూం ఇండ్లకు గాను 29మంది లబ్ధిదారులకు పట్టాలు అందించగా గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారన్నారు. మిగిలిన 11 ఇండ్లకు సైతం అధికారులు పూర్తి పారదర్శకంగా సర్వే నిర్వహించి అర్హులను గుర్తించి కలెక్టర్ ఆదేశానుసారం వారం రోజుల్లోపు లబ్ధిదారులకు కేటాయించాలన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, ఆర్అండ్బీ ఈఈ శంకరయ్య, ఎంపీటీసీ బొరెడ్డి వనజ, బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ శ్యాగర్ల పరమేశ్, మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్, తాసీల్దార్ బ్రహ్మయ్య, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, సర్పంచులు నామసాని సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, మల్లప్ప, ఎంపీటీసీ గిద్దె కర్ణాకర్, కోఆప్షన్ సభ్యుడు రహమత్ షరీఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దునాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
సొంతింటి కల నేరవేరింది
ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న సొంతింటి కల సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సహకారంతో నెరవేరింది. ఉచితంగా డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించి ఇవ్వడం గొప్ప విషయం. సొంతింటి కల సాకారమైనందుకకు సంతోషంగా ఉన్నాం.
– గర్దాస్ లక్ష్మీలింగయ్య దంపతులు