కోదాడ, జూలై 26 : విద్యార్థులు న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాలని 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ఉమర్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో రేస్ ఐఐటి, మెడికల్ బాలికల కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ నుండి చట్టాలపై అవగాహన పెంచుకుంటే ఉజ్వల భవిష్త్ సాధ్యమవుతుందని, ముఖ్యంగా కళాశాలలో యువత ఏమాత్రం తప్పటడుగు వేసినా భవిష్యత్లో జీవితం అంధకారంగా మారే అవకాశం ఉందన్నారు.
చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్, మాదకద్రవ్యాల వినియోగం, పోక్సో చట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకట రెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నరసయ్య, సీనియర్ న్యాయవాది గట్ల నర్సింహారావు, టి.సీతారామరాజు, చలం, దొడ్డ శ్రీధర్, జానీపాషా, కె.శరత్ కుమార్, ఆవుల మల్లిఖార్జున్, ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీనివాస్, మండవ మధు, శివశంకర్, దుర్గాప్రసాద్, పారా లీగల్ వలంటీర్లు, మండల లీగల్ సర్వీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.