దేవరకొండ:జాతీయ స్ధాయి పుట్బాల్ పోటీలకు ముగ్గురు విద్యార్ధినిలు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సునిలా తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మహత్మగాంధీ యూనివర్శిటీ పరిధిలో జరిగిన ఇంటర్ కాలేజీ టౌర్నమెంట్ లో దేవరకొండ ఎస్టీ గురుకుల డిగ్రీ మహిళా కళాశాల మొదటి సంవత్సరం విద్యార్ధులు చిట్టి, అఖిల, నవ్యలు జాతీయ స్ధాయి పుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. విద్యార్ధులు ఈ నెల 21 నుంచి 26 వరకు బెంగళూరులో జరిగే జాతీయ స్ధాయి పోటీల్లో పాల్గొంటారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్ధినీలను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.