రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండో రోజు ఆదివారం కబడ్డీ, వాలీబాల్, పుట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్ పోటీలు నిర్వహించారు.
రాజాపేట, డిసెంబర్ 10 : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం రెండోరోజు 9వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, బాల్ బాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్ పోటీలు నిర్వహించారు. సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ స్పోర్ట్స్ మీట్ సెక్రటరీ రామ్లక్ష్మణ్ క్రీడలను పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందుతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే క్రీడల్లో రాణించవచ్చని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి, పీడీ వెంకటేశ్వర్లు, పీఈటీ నరేశ్, 8జోన్ల క్రీడాకారులు పాల్గొన్నారు.