– పట్టించుకోని విద్యుత్, మండల పరిషత్ అధికారులు
నకిరేకల్, ఫిబ్రవరి 11 : నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలోని వీధిలైట్లు పట్టపగలే వెలుగుతున్నా సంబంధిత పంచాయతీ అధికారి గానీ, గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదు. తెల్లవారుజామున 6 గంటలకే వీధిలైట్లను బంద్ చేయాల్సి ఉన్నా ఇలా వదిలేయడం పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది. గత కొన్ని నెలలుగా ఇదే తంతు నడుస్తుందని ఇటు అధికారులు గానీ, అటు పంచాయతీ సిబ్బంది గానీ ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెలలు తరబడి కరెంట్ వృథా అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ ఏఈ గానీ, ఎంపీఓ గానీ, ఎంపీడీఓ గానీ స్పందించి విద్యుత్ వృథాను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.