చందంపేట, ఆగస్టు 26 : గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. మార్నింగ్ వాక్లో భాగంగా మంగళవారం చందంపేట మండల కేంద్రంలో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి మెనూ ప్రకారం భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ జామున మాధవ్ రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మి, తాసీల్దార్ శ్రీధర్ బాబు, మాజీ ఎంపీపీలు గోవిందా, సర్వయ్య, బికు నాయక్, కొర్ర రామ్సింగ్ నాయక్, హరికృష్ణ, బాధ్యనాయక్, సాదిక్, గోపాల్రావు, రంగయ్య, గిరి, కొండల్, శంకర్ రావు పాల్గొన్నారు.