రామన్నపేట, జనవరి28: కేంద్రంలోని బీజేపీ అరాచకాలకు కళ్లెం వేయాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జనంపల్లి ఎంపీటీసీ వేమవరపు సుధీర్బాబుతో పాటు వివిధ గ్రామాలకు చెందిన 200 మంది యువకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో సూర్యాపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధిని చూసిన ఇతర రాష్ర్టాల ప్రజలు దేశంలో బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. దేశానికే రోల్మోడల్గా మన పథకాలు నిలుస్తున్నాయన్నారు. ఆయా
బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, సర్పంచులు ఎడ్ల మహేందర్రెడ్డి, రేఖ యాదయ్య, ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్రెడ్డి, అక్కెనపల్లి ప్రవీణ్, బాలగోని శివ, బడుగు రఘు, బాసాని రాజు, ఆవుల శ్రీధర్, నడిగోటి కృష్ణ పాల్గొన్నారు.