కోదాడ, ఆగస్టు 11 : సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. చిలుకూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన 30 కాంగ్రెస్ కుటుంబాలు కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా రాజకీయాలకతీతంగా జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషిచేస్తున్నామన్నారు. పార్టీలో చేరిన వారు పోలంపల్లి వెంకన్నగౌడ్, వేముల వెంకయ్య, రాయబారపు లక్ష్మయ్య, పుల్లారావు, శ్రీహరి, రాయబారపు శ్రీనివాసరావు, వేముల శ్రీను, సతీశ్, సురేశ్, కాంపాటి రమేశ్, సతీశ్, వేముల సుధాకర్, శ్రీను, వెంకటయ్య, పుల్లారావు, వేము ల శ్రీను ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు బుర్రా పుల్లారెడ్డి, టీఆర్ఎస్ రామాపురం గ్రామశాఖ అధ్యక్షుడు కట్టెకోల వెంకన్నగౌడ్, గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి గన్నా కోటి, మీరా,యూత్ అధ్యక్షుడు అశోక్, ఎ.కృష్ణాగౌడ్ పాల్గొన్నారు.