కోదాడ, జనవరి 30 : పేదల అభ్యున్నతికి బీఆర్ఎస్ సర్కారు నిరంతరం కృషి చేస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం అనంతగిరి మండలంలోని పాలారం తండా, మునగాల మండలంలోని కలకోవ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నుంచి 50 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులయ్యే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
పార్టీలో చేరిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. గతంలో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళ సంతరించుకున్నాయని తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కలకోవ గ్రామస్తులు పనస శ్రీనివాస్, కొంపెల్లి శ్రీనివాస్, అమరగాని మల్లయ్య, అమరగాని వీరబాబు, శ్రీనివాస్, చిర్ర వీరబాబు, మండవ వినోద్, సురభి ప్రసాద్, కొంపెల్లి భిక్షం, మునగలేటి గోపయ్య, సురభి లక్ష్మీనారాయణ, మండవ నవీన్ కుటుంబాలు, పాలారం తండాకు చెందిన మరో 15 కుటుంబాలు ఉన్నాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అనంతగిరి మండలాధ్యక్షుడు గింజుపల్లి రమేశ్, కలకోవ గ్రామ సర్పంచ్ వీరబాబు, మాజీ సర్పంచ్ చిర్ర శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, నాగరాజు, బోసునాయక్ పాల్గొన్నారు.