ముగిసిన శ్రీవల్లి టౌన్ షిప్ వేలం
పలు ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేసిన బిడ్డర్లు
నల్లగొండ, జూన్ 26 : నార్కట్పల్లి మండలం దాసరిగూడెంలోని రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్షిప్ ఓపెన్ ప్లాట్లతోపాటు ఇండ్లకు వారం రోజులుగా నిర్వహించిన వేలం ఆదివారం ముగిసింది. కలెక్టర్ రాహుల్శర్మ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఆదివారం చివరిరోజు సైతం ఆసక్తి కలిగిన బిడ్డర్లు పెద్ద ఎత్తున వేలంలో పాల్గొని ప్లాట్లు, ఇండ్లను దక్కించుకున్నారు. మొత్తం రూ.5.11 కోట్ల విలువైన ప్లాట్లు, ఇండ్లను బిడ్డర్లు కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. శ్రీవల్లి టౌన్షిప్లో ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వమే అన్నిరకాల వసతులు కల్పిస్తుందని తెలిపారు. ప్లాట్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి బ్యాంకులు రుణాలు ఇస్తాయని చెప్పారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, వీసీపీఓ బాలశౌరి, రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు మేనేజర్ షఫియొద్దీన్ పాల్గొన్నారు.