అర్వపల్లి, మార్చి 2 : అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం సహస్రనామ తులసి దళార్చన చేపట్టారు.
అనంతరం హంస వాహనంపై లక్ష్మీ నరసింహ స్వామి, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవిలు కొలువుదీరగా పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఇంటింటికీ హారతులిచ్చి కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. ఉత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్రెడ్డి, అర్చకులు రాంబాబు, పవన్, భక్తులు పాల్గొన్నారు.