కోదాడ, మార్చి 20 : శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో కోదాడ పట్టణానికి చెందిన శ్రీ సిటీ స్కూల్ విద్యార్థులు 20 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ డి. నైనిక, నాల్గొవ ర్యాంక్ ఎండి.అబ్దుల్ రెహమాన్, సీహెచ్ లిఖిల్ ప్రీతివ్ సాధించారు.
జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాయి సూరజ్, రెండో ర్యాంక్ ఏ.పూజశ్రీ, మూడో ర్యాంక్ పి. అశ్వద్, ఎండీ. రిదా, మెహన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రవీంద్ర భారతిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఆదాయపు పన్ను కమిషనర్ జీవన్లాల్ లావిడియా చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. గురువారం పాఠశాల ఆవరణలో విద్యార్థులను ప్రిన్సిపాల్ టి.నరేశ్, కరస్పాండెంట్ వేదాంతరావు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.