దక్షిణ మధ్య రైల్వే అధికారుల వెల్లడి
సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, తిరుపతి, కాచిగూడ, నర్సాపూర్, తిరుపతి, కాచిగూడ స్టేషన్ల మధ్య పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక వారాంతపు రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. అందుకు సంబంధించిన పూర్తిస్థాయి టైంటేబుల్ను ఎస్సీఆర్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు అధికారులు వెల్లడించారు.
23 నుంచి స్పిర్చువల్ గ్యాదరింగ్..
ఈ నెల 23 నుంచి 25 వరకు చేగూరు రైల్వే స్టేషన్లో అంతర్జాతీయ స్పిర్చువల్ గ్యాదరింగ్ నిర్వహిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు సోమవారం ప్రకటించారు. అందులో భాగంగా దేశ, విదేశాల నుంచి వచ్చే వారి సౌకర్యార్థం షాద్నగర్, వికారాబాద్ స్టేషన్లలో పలు రైళ్లకు టెంపరరీ స్టాపేజీ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో చెంగల్పట్టు-యలహంకా, కాచిగూడ-చెంగల్పట్టు, యలహంకా-కాచిగూడ రైళ్లకు షాద్నగర్లో స్టాపేజీ ఉన్నట్లు తెలిపారు. అలాగే ముంబాయి-భువనేశ్వర్, రాజ్కోట్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి వికారాబాద్లో స్టాపేజీ ప్రకటించినట్లు చెప్పారు.