నల్లగొండ : అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు అంబేద్కర్ అని గాఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కొనియాడారు. గురువారం దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో, వారికి కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన అన్నారు. అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టం అని ఆయన అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుంది అని ఆయన అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వాడిత్య దేవేందర్, మ్యూనికుంట్ల వెంకట్ రెడ్డి, పొన్నబోయిన సైదులు, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, కడారి తిరపతయ్య, ఎర్ర విజయ్, శ్రీను, గిరి, సురేష్, అశోక్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.