మిర్యాలగూడ/మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 25 : మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ర్టానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఏడుకోట్లతండా వైజంక్షన్, తడకమళ్ల క్రాస్రోడ్డు, మినీట్యాంక్బండ్, మినీ రవీంద్ర భారతి, సేవాలాల్, అంబేద్కర్, పూలే భవనాలను షా అసోసియేట్స్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పాల్గొని మాట్లాడారు. రూ.10కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టామని, మరింత అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు చెప్పారు. సమావేశంలో వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కమిషనర్ రవీందర్సాగర్, ఎస్ఈ వెంకటేశ్వర్రావు, డీఈ సాయిలక్ష్మి, వినీల్, సుభాని, శ్రీనివాస్యాదవ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మరళీధర్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
మిర్యాలగూడ : పట్టణానికి చెందిన కోటగిరి మురళీధర్(82) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అక్కడికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, కౌన్సిలర్ సలీం ఉన్నారు.