మేళ్లచెర్వు, ఫిబ్రవరి 10 : మేళ్లచెర్వులో శంభులింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం ఎదుట రథాంగ పూజ, రథాంగ హోమం, బలిహరణ పూజలను అర్చకులు రాధాకృష్ణమూర్తి, విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ శాస్ర్తోక్తంగా జరిపించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను రథంపై నిలిపి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. మంగళ వాయిద్యాలు, వేద బ్రాహ్మణుల మంత్రాల నడుమ రథయాత్ర సాగింది. అంతకు ముందు ఉదయం అభిషేకాలు, అర్చనలు తదితర కార్యక్రమాలు జరిగాయి.
జాతర మూడో రోజూ ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. టీటీడీ కల్యాణ మండపంలో అన్నదానం కొనసాగింది. శనివారం అర్ధరాత్రి దాకా వేసిన బాలనాగమ్మ నాటకం వీక్షకులను ఆకట్టుకున్నది ఉత్సాహంగా ఎద్దుల పందేలు, కబడ్డీ పోటీలు
మేళ్లచెర్వు జాతర సందర్భంగా ఆదివారం నాలుగు పళ్లు, ఆరు పళ్ల విభాగాల్లో ఎద్దుల పందేలు ఉత్సాహంగా సాగాయి. మరో వైపు కబడ్డీ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. పోటీలను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.