భువనగిరి అర్బన్, మార్చి 7 : ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈఓ నారాయణరెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు వరకు నిర్వహించాలని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలకు సూచించారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ముందుగా స్పెషల్ తరగతులు నిర్వహించాలని, పదో తరగతి పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని, ఈ సూచనలు తప్పక పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.