సాధారణంగా బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బును డ్రా చేసుకునేందుకు పట్టణాల్లో అక్కడక్కడా ఏటీఎంలు ఉండడం తెలిసిందే. కానీ, చాయ్ ప్రియులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చాయ్ ఏటీఎం కోదాడ పట్టణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పట్టణంలోని ప్రధాన రహదారిలో గల నాగార్జున లాడ్జి సమీపంలో పట్టణానికి చెందిన జైరామ్ అనే యువకుడు నూతనంగా చాయ్ ఏటీఎం ప్రారంభించాడు.
ఈ ఏటీఎం ద్వారా పట్టణ ప్రజలకు టీ, కాఫీ, లెమన్ టీ, బాదం మిల్క్ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఓ య్యూటూబ్ ఛానల్లో ఎనీ టైం టీ మిషన్కు సంబంధించిన వివరాలు తెలుసుకొని వారి సమాచారం మేరకు హైదరాబాద్లో రూ.2.50 లక్షలు వెచ్చించి మెషిన్ కొనుగోలు చేసి కోదాడలో ప్రారంభించాడు.
మిషన్పై ఉన్న క్యూర్ కోడ్తో సెల్ఫోన్ ద్వారా స్కాన్ చేయాలి. దాంతో డబ్బులు కట్ అవుతాయి. అనంతరం మిషన్ పైభాగంలో టీ వచ్చే ప్రాంతంలో కప్పు పెడితే ఆటోమెటిక్గా చాయ్ కప్పులోకి వచ్చి దానంతట అదే ఆగిపోతుంది. అలాగే కాఫీ, బాదం మిల్క్, లెమన్ టీ, వాటర్ బాటిల్, బిస్కెట్స్కు సంబంధించిన క్యూర్ కోడ్లు ఉన్నాయి. కావాల్సిన వాళ్లు స్కాన్ చేసి వాటిని పొందవచ్చు.
టీ రూ.10, కాఫీ, లెమన్టీ, బాదం మిల్క్ రూ.15 చొప్పున రేట్లు ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో కోదాడ పట్టణంలోనే ప్రథమంగా చాయ్ ఏటీఎంను పెట్టినట్లు నిర్వాహకుడు తెలిపారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన చాయ్ ఏటీఎం సక్సెస్ కావాలని పట్టణ ప్రజలు యువకుడిని అభినందిస్తున్నారు.