తుంగతుర్తి, మార్చి 10 : సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాడుకొండ సీతయ్య మాట్లాడుతూ.. సమాజ అభ్యున్నతికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల విద్య కోసం, సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయి చేసిన కృషి ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తూనికి సాయిలు, గోపగాని రమేశ్ గౌడ్, గోపగాని శ్రీను, తడకమళ్ల మల్లికార్జున్, వెంకన్న, కడియం గోపి, లతీఫ్ పాల్గొన్నారు.