నల్గొండ, జనవరి 3 : సావిత్రీబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సావిత్రీబాయ్ పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలికా విద్యకు ఆమె చేసిన కృషిని కొనియాడారు. హాలియాలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.