బొడ్రాయిబజార్, జనవరి 5 : కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఓడీఎఫ్++గా గుర్తింపును సొంతం చేసుకుందని మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణాల్లో పారిశుధ్యం, పబ్లిక్ కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్వహణలో ప్రాధాన్యం లభించిందని పేర్కొన్నారు.
గత అక్టోబర్ నెలలో కేంద్రం నుంచి వచ్చిన బృందం సూర్యాపేట మున్సిపాలిటీలో బహిరంగ మల మూత్ర విసర్జనకు తీసుకుంటున్న చర్యలు, మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రతను గుర్తించి ఓడీఎఫ్++గుర్తింపును ఇచ్చినట్లు తెలిపారు. ఓడీఎఫ్++ గుర్తింపు దక్కడం గర్వంగా ఉందని, అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు చెప్పారు.