– నల్లగొండ రూరల్ ఎస్ఐగా శివకుమార్
నీలగిరి, జూన్ 19 : నల్లగొండ రూరల్ ఎస్ఐ డి.సైదాబాలు బదిలీ అయ్యారు. నల్లగొండ టూ టౌన్ ఎస్ఐగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రూరల్ ఎస్ఐగా శివకుమార్ బాద్యతలు చేపట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇరువురు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, డీఎస్పీ కొలను శివరాంరెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. సైదాబాబు రూరల్ ఎస్గా పనిచేసన రెండున్నరేండ్ల కాలంలో మండలంలో గంజాయి విక్రయాలు, పేకాల స్థావరాలు, అసాంఘీక కార్యక్రమాలు, అక్రమ ఇసుక రవాణా, అక్రమ బియ్యంపై ఉక్కుపాదం మోపారు. రౌడీ షీటర్లు, సమస్యాత్మాక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలను చైతన్యం చేశారు. టూ టౌన్ ఎస్ఐగా బాధ్యతల స్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణంలో శాంతి భద్రతలను పరిరక్షణకు కృషీ చేస్తానని, రౌడీ షీటర్ల కదలికలపై 24 గంటల పాటు పర్యవేక్షణ కొనసాగనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై పీడీ యాక్ట్ సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉంటుందని పేర్కొన్నారు.