నందికొండ, సెప్టెంబర్ 13 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు మంగళవారం శ్రీశైలం నుంచి 3,14,235 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ఎన్నెస్పీ అధికారులు సాగర్ ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,37,040 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312 టీఎంసీ) కాగా ప్రస్తుతం 589 అడుగులు (309.5070 టీఎంసీ) ఉంది. రిజర్వాయర్ నుంచి కుడికాల్వకు 8,452 క్యూసెక్కులు, జలవిద్యుత్ కేంద్రానికి 33,495, ఎస్ఎల్బీసీకి 1800, వరద కాల్వకు 400 క్యూసెక్కులు మొత్తం 2,81,187 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా(211.3637 టీఎంసీ) ఉంది. ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 2,35,544 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది.
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు మంగళవారం ఎగువ ప్రాంతాల నుంచి 9,092 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 5 క్రస్టు గేట్లను ఎత్తి 9,398.96 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వకు 275.06, ఎడమ కాల్వకు 188.61 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. 47.56 క్యూసెక్కులు ఆవిరి రూపంలో, 200 క్యూసెక్కుల నీరు సీపేజ్ రూపంలో పోతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 642.45 అడుగులు(3.80 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.