భువనగిరి అర్బన్, అక్టోబర్ 31: రైతుల గోసను తీర్చింది బీఆర్ఎస్ ప్రభ్వుమేనని బీఆర్ ఎస్ పార్టీ జిలా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని పార్టీ కార్యాల యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి మం గళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏండ్ల క్రితం ఉన్న ప్రభుత్వాలు ఏనాడూ రైతులను పట్టించు కోలేదన్నారు. రైతు బంధును ఆపాలని చూస్తే రైతులు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఖతం చేస్తార ని హెచ్చరించారు. ఉమ్మడి న ల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 12 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెసోళ్ల్ల మాటలు ప్రజలు నమ్మరు
కాంగ్రెసోళ్లు చెప్పే మాయమాటలు భువనగిరి నియోజకవర్గ ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు రైతులకు, ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమం కళ్ళముందే కనిపిస్తుందని తెలిపారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. రాష్ట్ర నాయకులు కల్లూరి రామచం ద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగాం పాండు, నాయకులు మధు సూ దన్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, అబ్బగాని వెంకట్ గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయి
భూదాన్ పోచంపల్లి: అభివృద్ధి సంక్షేమ ప థకాలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవా రం మండలంలోని మెహర్నగర్, జలాల్పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఓటర్లను ఆప్యాయంగా కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. కనుముకులకి చెందిన 15మంది, మెహర్నగర్కి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాడుగుల ప్రభాకర్రెడ్డి, కోట పుష్పలత మల్లారెడ్డి, పాక వెంకటేష్యాదవ్, కందాడి భూపాల్రెడ్డి, సుధాకర్రెడ్డి, చిలువేరు బాలనరసింహ, సీర్పంగి స్వాతి వెం కటేశం, పర్ని రజితమల్లారెడ్డి,రావుల శేఖర్రెడ్డి, గోరంటి శ్రీనివాస్రెడ్డి, లింగస్వామి పాల్గొన్నారు.