తెలంగాణ ఏర్పాటు తర్వాత కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని, సీఎం కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడు మండలం కిష్టాపురంలో బుధవారం గొర్రెలు, మేకలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని పెద్దచెరువులో 82వేల చేప పిల్లలను విడుదల చేసి మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, దాంతో నేడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యిందన్నారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ఆకలిని, దారిద్య్రాన్ని పారదోలిన దార్శనికుడు కేసీఆర్ అని, ఏ సందర్భంలోనైనా ఆయనకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
మునుగోడు, సెప్టెంబర్ 14 : సీఎం కేసీఆర్ దార్శనికతతోనే తెలంగాణలో కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని కిష్టాపురం గ్రామంలో బుధవారం చేపట్టిన గొర్రెలు, మేకలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని పెద్దచెరువులో 82వేల చేప పిల్లలు విడుదల చేసి మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మునుగోడు ప్రాంతం 50ఏండ్లుగా తీవ్ర కరువుతో ఉండేదని, తెలంగాణ సాధించాక సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో పచ్చదనంగా మారిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగుపర్చేందుకు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోని మత్స్య, పౌల్ట్రీ రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దేశంలో అత్యధిక మత్స్య సంపదను ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని కొనియాడారు. విభిన్న వర్గాల కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు సీఎం కేసీఆర్కు మంత్రి తలసాని చేదోడువాదోడుగా ఉంటున్నారని అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ దార్శనికతతో ఇంటింటికీ మిషన్ భగీరథతో రక్షిత జలాలు అందించి మునుగోడులో ఫ్లోరైడ్ను శాశ్వతంగా రూపుమాపారన్నారు.
తెలంగాణతో పాటు నల్లగొండ జిల్లాలో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసు నమోదు కాలేదని పార్లమెంటులో స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటించారని స్పష్టం చేశారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నామన్నారు. ఏ సందర్భంలోనైనా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మనమంతా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అంతకుముందు గ్రామ ంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్త మత్స్యకార సొసైటీలకు ప్రభుత్వం మంజూరు చేసిన పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మదర్ డెయిరీ ఛైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, డీఎల్డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, పశు సంవర్ధకశాఖ పీడీ శ్రీనివాస్రావు, మత్స్యశాఖ జిల్లా అధికారి వెంకయ్య, ఎంపీపీ కర్నాటి స్వామి, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాజుల అంజయ్యగౌడ్, సర్పంచులు నందిపాటి రాధ, బొజ్జ సుజాత, ఎంపీటీసీలు చెరుకు కృష్ణయ్య, సైదులు, గాలయ్య పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి తలసాని
మేం రాజీనామా చేసినందుకే చేప పిల్లలు, గొర్రెలు వస్తున్నాయని కొందరు మూర్ఖులు ప్రచారం చేసుకుంటున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. ఎవరో రాజీనామా చేస్తే పథకాలు రావని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరాయంగా అందిస్తున్నదన్నారు. రాష్ట్రంలో 35లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేసే బాధ్యత టీఆర్ఎస్ సర్కారుదని, ఇప్పటికే సగం మందికి పైగా పంపిణీ చేశామని తెలిపారు. మేము రాజీనామా చేయడం వల్లే ఎండ, వానొచ్చిందని కొందరు చెప్పుకొంటారేమోనని ఎద్దేవా చేశారు. గొర్రెలు కావాలని గొల్ల కురుమలు, చేప పిల్లలు కావాలని మత్స్యకారులు ఏనాడూ అడగలేదని, గ్రామాలు, రాష్ట్రం బాగుండాలనే గొప్ప మనసుతో సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉందని, నాడు మంత్రులుగా ఉన్నవారికి ఫ్లోరైడ్ సమస్య తీర్చే సోయి లేకపోయిందని విమర్శించారు. 2014కు ముందు ఏ రోజైనా 24 గంటల కరెంటు, తాగడానికి మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయా అని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పలేకపోయారన్నారు. మత్స్యకారుల కుటుంబాల్లో 18ఏండ్లు నిండిన వారందరికీ సభ్యత్వం ఇస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే మరిన్ని పథకాలు అమలు చేస్తుందన్నారు.
అడుగక ముందే అన్నీ ఇస్తున్న కేసీఆర్
గొర్రెలు కావాలని గొల్ల కురుమలు, చేప పిల్లలు కావాలని మత్స్యకారులు ఏనాడూ అడుగలేదు.. గ్రామాలు, రాష్ట్రం బాగుండాలనే గొప్ప మనస్సుతో సీఎం కేసీఆర్ ఇవన్నీ ఇస్తున్నారు. మేం రాజీనామా చేసినందుకే చేప పిల్లలు, గొర్రెలు వస్తున్నాయని కొందరు మూర్ఖులు ప్రచారం చేసుకుంటున్నారు.. ఎవరో రాజీనామా చేస్తే పథకాలు రావు.. అన్ని వర్గాల కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
నిరంతరాయంగా కొనసాగుతాయి. తెలంగాణకు రావాలి, టైంపాస్కు టీఆర్ఎస్ను తిట్టాలనే బీజేపీ నాయకులు పనిగా పెట్టుకున్నారు.
– తలసాని శ్రీనివాస్యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ మంత్రి
పేదింటి కుటుంబాలకు పెద్దన్న సీఎం కేసీఆర్
నాంపల్లి : పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి సాయం అందిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండల వ్యాప్తంగా 32గ్రామ పంచాయతీలకు చెందిన 208మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి లబ్ధిదారులకు నూతన పట్టు చీరలు అందించారు. కార్యక్రమంలో అడీషనల్ కలెక్టర్ భాస్కర్రావు, ఎంపీపీ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ రజిని, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకన్న, ఎంపీడీఓ, తాసీల్దార్ పాల్గొన్నారు.