భువనగిరి అర్బన్, నవంబర్ 29 : రైలస్ మిల్లర్ల అపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి.నాగభూషణం అన్నారు. రైస్ మిల్లర్స్ చెల్లించే సెంట్రల్ సేల్స్ టాక్సీ బకాయిలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆవరణలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకాన్ని చేశారు. గత ప్రభుత్వాలు రైస్ మిల్లర్స్ను ఏనాడు పట్టించుకోలేదన్నారు. రైస్ మిల్లర్లను ఆదుకున్న మహానీయుడు కేసీఆర్ అని కొనియాడారు. జిల్లాలోని రైస్ మిల్లర్స్ సీఎం కేసీఆర్ వెన్నంటే ఉంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ ట్రెజరర్ మార్త వెంకటేశం, సభ్యులు జిల్ల వెంకట్మ్రణ, దయాకర్, మహేశ్, కిరణ్, వెంకటేశ్వర్లు, సుదర్శన్, నర్సయ్య పాల్గొన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమ ప్రదాత సీఎం కేసీఆర్
హాలియా : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమ ప్రధాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి అన్నారు. సీఎస్టీ రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలువు మేరకు నాగార్జున సాగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్తో కలిసి హాలియాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా చిట్టిపోలు యాదగిరి ఎమ్మెల్యే భగత్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో ఇటు రైతులకు అటు మిల్లర్లకు మేలు జరుగుతుందన్నారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 3 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి మిల్లర్లు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో హాలియా మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, ఎడమ కాల్వ మాజీ వైస్ చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి, మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు పోలపూడి బాలకృష్ణ, చిట్టిపోలు వెంకన్న, కర్ణ సాగర్, రమేశ్, యాద ఈదయ్య, చిట్టిపోలు రంజిత్ కుమార్, చిత్తనూరి పవన్కుమార్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఐదేండ్ల సమస్య పరిష్కారం
కోదాడ రూరల్, నవంబర్ 29 : సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ రద్దుపై హర్షం వ్యక్తం చేస్తూ కోదాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కాశినేటి జయప్రకాశ్ మాట్లాడుతూ.. ఐదేండ్ల సమస్యను పరిష్కరించినందుకు అసోసియేషన్ తరుపున ప్రభుత్వానికి ధనవ్యాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి నీలా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు వెంపటి మధుసూదన్రావు, పష్య నవీన్రెడ్డి, కార్యదర్శి కేస సత్యనారాయణ, కోశాధికారి చల్లా అమరేందర్, ఓరుగంటి బ్రహ్మం, తెల్లకూల వెంకటేశ్వర్లు, కొత్తా నాగేశ్వరావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
బొడ్రాయిబజార్, నవంబర్ 29 : సెంట్రల్ సేల్ టాక్స్ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రైస్ మిల్లర్స్ భవనంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 2015 ఏప్రిల్ నుంచి 2017 జూన్ వరకు రాష్ట్ర రైస్ మిల్లర్స్కు రూ.1,500 కోట్ల పన్ను మినహాయింపు కలిగిందన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బోనాల రవీందర్, బ్రహ్మదేవర సీతయ్య, కాసం జగన్, మొరిశెట్టి శ్రీనివాస్, మహంకాళి రామ్మూర్తి, గుండా కృష్ణ, మురళీధర్, శేషవతారం, కొత్త ఆంజనేయులు, బండారు సత్యనారాయణ, లక్ష్మయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.