చందంపేట: మండలంలోని ముడుదండ్ల గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు టిఆర్ఎస్ నాయకులు. గ్రామంలో పాఠశాలకు ప్రహరీ, గ్రామం నుంచి ముడుదండ్ల గేటు వరకు బీటీ రోడ్డు, సీసీ రోడ్డుతో పాటు మరిన్ని నిధులు కేటాయించాని టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే త్వరలో నిధులు కేటాయించి గ్రామాభివృద్దికి సహకరిస్తానని తెలిపారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు యాసాని రాజవర్దన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు జక్కుల మున్నయ్య యాదవ్, ఉప సర్పంచ్ మురళి,వార్డు మెంబర్లు యాదయ్య, దశరథం, ధర్మా రెడ్డి,అనిల్, శ్రీనివాస్ ఉన్నారు.