మిర్యాలగూడ రూరల్, జనవరి 27 : యాసంగి సీజన్కు ఆరుతడి విధానంలో సాగు చేసేందుకు వివిధ రకాల అపరాల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు నందిపహాడ్ విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ ఆర్.కృష్ణవేణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేరుశనగ -6కే రకం విత్తనాలు 30 కిలో బ్యాగు ధర రూ.2,865, శనగ -జేజీ-11 రకం 25 కిలోల బ్యాగు రూ. 1,875, మినుములు పీయూ-31రకం 4 కిలోల బ్యాగు రూ.424, పెసర ఎంజీజీ-295 రకం 4 కిలోల బ్యాగు రూ.432.40 , పొద్దుతిరుగుడు విత్తనాలు 6 కిలోలు రూ. 449.10 ఉన్నట్లు పేర్కొన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు మిర్యాలగూడ పట్టణ శివారులోని విత్తనాభివృద్ధి సంస్థ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.