మేళ్లచెర్వు, మే 4 : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం కందిబండ గ్రామానికి చెందిన రాగుల నరేశ్యాదవ్ ప్రపంచ ప్యారా బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు.
చైనాలో ఈ నెల 28 నుంచి జూన్ 5 వరకు జరుగనున్న పోటీల్లో ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నంలో జరిగిన సెలెక్షన్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గానూ తనను ఎంపిక చేసినట్లు నరేశ్ శనివారం తెలిపారు.