FM Radio | నల్లగొండ/ దేవరకొండ, ఏప్రిల్ 28 : సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో సేవలు నల్లగొండ ఇండస్ట్రియల్ పారులో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా సేవలను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖుష్భూ గుప్తా, ఆల్ ఇండియా రేడియో రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంజినీరింగ్ నరేంద్ర కుమారి, డిప్యూటీ డైరెక్టర్ మూర్తి, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఎం.పీ.రాజశేఖర్ పాల్గొన్నారు.
శుక్రవారం నుంచి నల్లగొండ, దేవరకొండ ఎఫ్ఎం స్టేషన్ ద్వారా పట్టణానికి 20 కిలోమీటర్ల పరిధిలో సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖుష్భూ గుప్తా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన సరైన సమాచారం, ప్రసారాలు అందించే ఆకాశవాణి ద్వారా నల్లగొండ ఎఫ్ఎం రేడియో స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉన్నదన్నారు.