నల్లగొండ : కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని పలు పాఠశాలలో మన ఊరు-మన బడి పథకంలో పాఠశాలల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంగ్లీష్ విద్యను పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలు అభ్యసించడానికి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం వారు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంపొందించే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.
నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులు అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టే విధంగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపొందించారని, ప్రజా ప్రతినిధులు అధికారులు చిత్తశుద్ధితో ప్రణాళికలు సిద్ధం చేసి షెడ్యూల్ ప్రకారం త్వరితగతిన పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో చింతపల్లి జడ్పీటీసీ కంకణాల ప్రవీణ ,టీఆర్ఎస్ నాయకుడు కంకణాల వెంకట్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి,మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొపిడి కిష్టారెడ్డి, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రచార కార్యదర్శి వింజమూరి రవి, తదితరులు పాల్గొన్నారు.