నల్లగొండ రూరల్, డిసెంబర్ 14 : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ట్రాన్స్పోర్ట్ కార్మికులు, ఓనర్లు,ఆటో డ్రైవ ర్లు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని బీఆర్టీయూ ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నాజర్ అలీ మీర్జా, నియోజకవర్గ అధ్యక్షుడు కలగోని యాదయ్య గౌడ్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో పది రోజులుగా 90 శాతం మహిళలలు బస్సులో ప్రయాణిస్తారని, ఆటోల్లో ఎక్కే వారు లేకుండా పోయారని వాపోయారు. ట్రాన్స్పోర్టు రంగం కార్మికులకు జీవనభృతి కింద నెలకు రూ.15 వేలు అందజేయాలన్నారు.
తక్షణమే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నరేందర్, రమేశ్, సుదర్శన్, జహంగీర్ , ఈదుల వెంకన్న, బాబా సైదులు, శ్రీను, శంకర్, వజ్రయ్య, హుస్సేన్, సైదులు పాల్గొన్నారు.