సూర్యాపేట రూరల్, జూన్ 1 : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు శతాబ్దాలు నిలిచిపోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఈ నెల 2నుంచి నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జనగాం క్రాస్రోడ్డులోని ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదేండ్లలో జరిగిన పురోగతి వర్తమానానికి మార్గదర్శనం అయ్యేలా ఉత్సవాలు ఉంటాయన్నారు. సంబురాల్లో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్ఛారు. రైతులకు ఇదొక ఉత్సవ శోభ కలిగిస్తుందన్నారు. సంక్రాంతిని మరిపింపేలా రైతులు సంబరాల్లో పాల్గొనేలా చూడాలని కోరారు.
కాళేశ్వరం జలాల తొలి ఫలం అందుకున్నది సూర్యాపేట జిల్లాయేనని, తద్వారా సూర్యాపేట నియోజకవర్గంలో ఇప్పుడు త్రివేణి సంగమం ఏర్పడిందని ఇది సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని కొనియాడారు. ఆధునిక దేవాలయాలుగా రైతు వేదికలు వర్దిల్లుతున్నాయన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలోనే టాప్గా నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అడీషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఎంపీపీలు బీరవోలు రవీందర్రెడ్డి, నెమ్మాది భిక్షం, మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, జడ్పీటీసీలు జీడి భిక్షం, మామిడి అనితాఅంజయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.