కనగల్, మే 12 : SSC – 2026 ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను కనగల్ ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ సీఈఓ ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి కనగల్ మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఎంఈఓ, పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయ బృందం, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రస్తుత విద్యా విధానం, భారతీయ సంస్కృతి, భవిష్యత్ ప్రణాళికలను క్లుప్తంగా వివరించి భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఇంతపెద్ద మొత్తంలో నిర్వహించిన ఎంపీడీఓ కుమారి వేద రక్షితను ప్రశంసించారు.
1. కె.దినేష్ కుమార్ – జడ్పీహెచ్ఎస్, చర్లగౌరారం
2. సీహెచ్ వైష్ణవి – జడ్పీహెచ్ఎస్, చిన్నమాదారం
3. బి. పవన్ సాయి – జడ్పీహెచ్ఎస్, దొరపెళ్లి
4. బి.దేవి ప్రియ – జడ్పీహెచ్ఎస్, జి.ఎడవెల్లి
5. కె.మమత – జడ్పీహెచ్ఎస్, కనగల్
6. కె.వర్షశ్రీ – జడ్పీహెచ్ఎస్, కురంపల్లి
7. ఏ.దయాకర్ – జడ్పీహెచ్ఎస్, రేగట్టే
8. ఆర్. కావ్య శ్రీ – కేజీబీవీ, కనగల్
9. వి.ఝాన్సీ – మోడల్ స్కూల్, బుడమర్లపల్లి