నల్లగొండ : దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ డి. నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్కె. నాగుల్ మీరాను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడిని ఎస్.ఐ., కానిస్టేబుల్ కొట్టిన వ్యవహారం సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఎస్పీ రంగనాధ్ దృష్టికి రావడంతో రెండు రోజుల క్రితం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఈ కేసులో డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా నియమించడం జరిగింది. విచారణ అధికారి సతీష్ చోడగిరి బాధితునితో పాటు చికిత్స చేసిన వైద్యులు, మరికొంత మందిని విచారించిన అనంతరం ఎస్ఐ తప్పిదం ఉన్నట్లుగా నిర్ధారఇంచారు. దీంతో ఎస్ఐ, కానిస్టేబుల్ ఇద్దరినీ సస్పెన్షన్కు సిఫార్సు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ రంగనాధ్ సిఫార్సు మేరకు హైదరాబాద్ రేంజ్ డిఐజి వి.బి. కమలహాసన్ రెడ్డి వీరిద్దని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.