నీలగిరి, ఫిబ్రవరి 27 : గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలోనే ఉక్కుపాదం మోపాలని, అవే కేసులు రిపీట్ అయితే పీడీ యాక్ట్ నమోదు చేయాలని నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని ఏఎస్పీ రాములు నాయక్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల విచారణను పారదర్శకంగా చేయాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసులను త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయాలని తెలిపారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని, అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిషారానికి చొరవ చూపాలని చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగులోన్న కేసులపై దృష్టి సారించి పరిషరించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు సంవర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. అంతకుముందు పోలీస్ వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎస్బీ డీఎస్పీ రమేశ్, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్ రాజు, గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ సైదా, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.