పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్ఠించి నవరాత్రులను వైభవంగా నిర్వహించుకుందామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకొని సూర్యాపేట కలెక్టరేట్లో గురువారం ‘మట్టి గణేశ్ విగ్రహాలనే పూజిద్దాం.. చెరువులను శుభ్రంగా ఉంచుకుందాం’అనే నినాదంతో రాష్ట్ర పర్యావరణ, విద్యా విభాగం,కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగిఉందని, ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగాకొనసాగుతుందని తెలిపారు.పీఓపీ వల్ల కలిగే అనర్థాలపై యువత నడుంబిగించాలని, మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్ఠించే విధంగా ప్రజలకుఅవగాహన కల్పించాలని కోరారు. తద్వారా పర్యావరణాన్ని కాపాడటంతోపాటు నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు. ఐక్యతతో వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకొందామని పిలుపునిచ్చారు.
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 10 : ప్రకృతిని ప్రేమిస్తూ మట్టి గణపతిని పూజిద్దామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించి గణేశ్ నవరాత్రులను వైభవోపేతంగా నిర్వహించుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చెరువుల్లో మట్టితోనే గణేశ్ విగ్రహాలు.. అందుకే చెరువులను శుభ్రంగా ఉంచుకుందాం అనే నినాదాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ విద్యా విభాగం, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను స్థానిక కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో మంత్రి గురువారం ఆవిష్కరించి మాట్లాడారు.
పీఓపీ రసాయనాల వల్ల కలిగే అనర్ధాలపై యువత నడుం బిగించి మట్టి గణపతి విగ్రహాలను పూజించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించే విధంగా ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్య చేయాలని కోరారు. ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాదించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతుందన్నారు. కాబట్టి వినాయక చవితి ఉత్సావాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యమిచ్చి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు వాతావరణాన్ని అందిద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అడిషనల్ కలెక్టర్ వెంకంట్రెడ్డి, ఏఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీ నాగభూషణం, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ సురేశ్బాబు, ఏఈ శంకర్బాబు పాల్గొన్నారు.