చౌటుప్పల్, ఆగస్టు 16 : టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ మార్కెట్ యార్డును మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులతో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు తగిన గౌరవమిచ్చే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు.
ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.