తిరుమలగిరిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ తుంగతుర్తి సమర శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఊహించిన దానికంటే ఎక్కువగా జనం రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. దీంతో తిరుమలగిరి పట్టణం గులాబీ వనంలా మారింది. సీఎం కేసీఆర్ ప్రసంగానికి జనం ఈలలు, చప్పట్లతో జేజేలు పలికారు. సీఎం ప్రసంగం పార్టీ శ్రేణులు, ప్రజల్లో మరింత ఉత్సాహం నింపింది. సభ విజయవంతం కావడంతో గులాబీ కార్యకర్తల్లో కొత్త జోష్ నెలకొంది.