నల్లగొండ: పార్టీ నూతన సారథులుగా బాధ్యతలు స్వీకరించిన వారు చిత్తశుద్ధితో పనిచేస్తూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సోమవారం ఆయన పట్ట ణంలోని 1,2,3,18,19,39,40 వార్డులో పర్యటించి నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షులను ప్రకటించి వారికి శుభా కాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలో తీసుకువచ్చేందుకు అనుగుణంగా అందరూ పనిచేయాలని సూచించారు.
ప్రతి వార్డు, గ్రామంలో పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణం చేసుకోని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్ప టికే నల్లగొండలో పార్టీ బలంగా ఉందని ఇంకా బలోపేతం చేసి ప్రతిపక్షాలకు స్థానం లేకుండా చేయాలని సూచించారు. ఆయా వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో సింహభాగం ఏక గ్రీవంగానే ఎన్నుకోవటం సంతోషకరమైన అంశంగా పేర్కొన్నారు.
సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామరాజు, ఆలకుంట్ల మోహన్ బాబు, రావులు శ్రీనివాస రెడ్డి, కొండూరు సత్యనారాయణ, బోయపల్లి కృష్ణారెడ్డి, కొప్పు క్రిష్ణయ్య, బూర జానయ్య, కటికం సత్తయ్య గౌడ్ , ఆల కుంట్ల నాగరత్నం రాజు, అనీస్ తదితరులు పాల్గొన్నారు.