భువనగిరి కలెక్టరేట్, మార్చి 3 : రాష్ట్రంలో పీఈటీ, పీడీ పోస్టులను భర్తీ చేయాలని పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాదగోని సైదులు గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటి వరకు ఆదివారం పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా పాదయాత్ర భువనగిరి కలెక్టరేట్ వద్దకు చేరుకోగా మాదగోని సైదులు గౌడ్ మీడియాతో మాట్లాడారు. పీఈటీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, పీఈటీ, పీడీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బీబీనగర్ లక్ష్మణ్, కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, నాయకులు ఉపేందర్, రమేశ్రెడ్డి, ఆంజనేయులు, సుధాకర్, శ్రీకాంత్, వెంకటేశం, రాజశేఖర్ పాల్గొన్నారు.