తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్
తుంగతుర్తి, జూన్ 19 : అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ గూటికి చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాదులోని నివాసంలో గొట్టిపర్తి ఎంపీటీసీ కీర్తిరెడ్డి లతావిజయ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో చింతకుంట్ల వెంకన్న, ఎల్లేశ్, పరశురాములు, సుధాకర్, రేణుక, శాంతి, నరేశ్, పరమేశ్, లక్ష్మి, సంధ్య, సుశీల, మంగమ్మ, పిచ్చమ్మ ఉన్నారు.