ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొన్న పలువురు
కట్టంగూర్(నకిరేకల్), మే 18 : ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ చేరుతున్న వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని చందుపట్ల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన దొంగల మల్లేశ్, కుర్ర వీరయ్య, ఇమ్మడిపాక కిశోర్, జిల్లా నాగయ్యతోపాటు మరో 50 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రధాన ధ్యేయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెంది దేశంలోనే నెంబర్వన్గా నిలిచిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరిక
తిరుమలగిరి : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై అనేకమంది స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పానుగంటి గణేశ్, మంద నరేశ్, పరశురాములుతోపాటు పలువురు ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యమని నమ్మి ప్రజలు పార్టీలో చేరుతున్నారన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అశోక్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్రెడ్డి, నాయకులు నరోత్తంరెడ్డి, లక్ష్మయ్య, బాబు, ప్రవీణ్ పాల్గొన్నారు.