మిర్యాలగూడ టౌన్, నవంబర్ 28 : కరోనా నేర్పిన గుణపాఠంతో ప్రస్తుతం అనేకమంది బయటకు వెళ్లకుండా తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను ఇంట్లోనే పండిస్తున్నారు. తమకున్న వసతిని బట్టి ఇంటి పెరట్లో, డాబాపై సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు.
ఈ క్రమంలో మిర్యాలగూడ పట్టణంలో పలువురు తమ ఇంటిపై ప్లాస్టిక్ డబ్బాలు, నీటి క్యాన్లు, కుండీలు పెట్టి కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. బీర, చిక్కుడు, దొండ, బచ్చలి వంటి తీగ కూరగాయలతోపాటు పండ్ల మొక్కలను సైతం సేంద్రియ పద్ధతిలో సాగు
యూట్యూబ్లో చూసి మొక్కలు పెంచుతున్నా..
మొదట యూట్యూబ్లో చూసి దేవుడి పూజకు కావాల్సిన మొక్కలను మేడపై పెట్టాం. ఆ తర్వాత అనేక రకాలతోపాటు పలు కూరగాయల మొక్కలను పెంచుతున్నాం. రోజూ మొక్కలకు నీళ్లు పోయడం, పాదులు చేయడం వల్ల స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. మంచి వ్యాయామం అవుతుంది. మా పిల్లలకు చిన్నప్పటి నుంచే మొక్కల పట్ల ప్రేమను పెంచుతూ వాటి సంరక్షణ పట్ల అవగాహన కల్పిస్తున్నాం.
– వెంకటలక్ష్మి, మిర్యాలగూడ
కూరగాయలు ఇంట్లోనే పండిస్తున్నాం..
మేము ఏడాదిన్నరగా మిద్దె తోటను సాగు చేస్తున్నాం. రోజూ ఉదయం ఒక గంటపాటు మొక్కలకు నీళ్లు పోసి పాదులు చేస్తాం. ప్రతి ఆదివారం నా భార్య, నేను పిచ్చి మొక్కలు తీసి సేంద్రియ ఎరువులు వేస్తాం. లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్లకుండా మేము పండించిన కూరగాయలు, ఆకుకూరలు దాదాపుగా సరిపోతున్నాయి. అవి తినడం వల్ల డబ్బు ఆదాతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం.