నల్లగొండ, అక్టోబర్ 6 : సీఎం కేసీఆర్ చొరవతో సహకార బ్యాంకులు ప్రస్తుతం రైతులకు మరింత చేరువయ్యాయని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని డీసీసీబీ పరిధిలో దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ను శుక్రవారం వారు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల హయాంలో డీసీసీబీలను పట్టించుకోకపోవడంతో రైతులకు కనీస సేవలు అందించలేక పోయాయన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీసీసీబీలు ఎంతో ఆర్థిక పురోగతి సాధిస్తే ఎంతో నష్టాల్లో ఉన్న నల్లగొండ డీసీసీబీ సైతం మూడున్నరేండ్లల్లో గణనీయమైన పురోగతి సాధించటం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఇందులో చైర్మన్తో పాటు పాలకవర్గం, ఉద్యోగుల కృషి ఉండటం వారికి ప్రభుత్వం సహకారం అందించడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు ఎంతో సహకారం చేసేలా సహకార బ్యాంకులు అభివృద్ధి సాదించాలని ఆకాంక్షించారు.
ప్రధానంగా వాణిజ్య బ్యాంకులతో పోటీ పడి అన్ని రకాల సేవలు అందించడంతో పాటు ఏ బ్యాంకులు ఇవ్వని విధంగా విదేశీ రుణాలు ఇవ్వడంతో ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్ లభిస్తున్నదని తెలిపారు. అనంతరం చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మట్లాడుతూ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 30బ్రాంచీలు ఉండగా కొత్తగా ఆరు బ్యాంకులు మంజూరైతే చిట్యాల, నల్లగొండ బ్రాంచీలు ఏర్పాటు చేశామని త్వరలో మిగిలినవి ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా మరో 13బ్యాంకులు కావాలని ప్రపోజల్స్ పెట్టామని అవి మంజూరైతే ఉమ్మడి జిల్లాలో రైతులకు సేవలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. ప్రభుత్వం రుణ మాఫీ చేసిన నేపథ్యంలో రైతుల రుణాలు మాఫీ చేసీ కొత్త రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం డీసీసీబీ కార్యాలయలో కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, డీసీసీబీ డైరెక్టర్లు పాశం సంపత్రెడ్డి, కుంభం శ్రీనివాస్రెడ్డి, అప్పిరెడ్డి, సైదయ్య, సైదులు, సుష్మ కోడి, అనూరాధ, కనగల్ ఎంపీపీ కరీంపాష, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, సీఈఓ మదన్మోహన్, డీజీఎం గంట్ల లక్ష్మమ్మ, జీఎం వసంతరావు, డీజీఎం అశోక్, జ్యోతిరాణి, ఏజీఎం ప్రవీణ్, శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ రాజు పాల్గొన్నారు.