నందికొండ, ఆగస్టు 13: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు చేపడుతున్నారు. శ్రీశైలం నుంచి 2,68,876 క్యూసెక్కుల వరద నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వచ్చి చేరుతుండడంతో, నాగార్జునసాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్ల (8 గేట్లు 10 అడుగులు, 18 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి ) ద్వారా 2,61,732 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్న ఇన్ఫ్లో ఆధారంగా క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను చేపడుతామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 ( 312.0450 టీఎంసీలు) అడుగులకు గానూ 588.80 (308.4658 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. కుడి కాల్వ ద్వారా 4050 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,664 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి క్రస్ట్ గేట్లు, జలవిద్యుత్ కేంద్రాలు, కాల్వల ద్వారా 2,96,246 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఎడమ, వరద కాల్వకు నీటి విడుదలను నిలుపుదల చేయగా, కుడికాల్వలకు నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు తగ్గించారు.