– కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ
కోదాడ, మే 11 : ప్రభుత్వ విద్యా పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కళాశాలలో విద్యతో పాటు సాంస్కృతిక, సామాజిక, సాహిత్య రంగంలో కూడా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఆమె సూచించారు. ప్రిన్సిపాల్ రమణారెడ్డి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు బోధన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఉదయశ్రీ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీలక్ష్మి, అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు, పిచ్చిరెడ్డి, రమేష్, శర్మ, వెంకన్న, రామరాజు, రవి, కిరణ్, మమత, డీఎస్ రావు పాల్గొన్నారు.