నల్లగొండ : 57 సంవత్సరాలు నించిన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం పీఏపల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హల్ 1662 మంది లబ్ధిదారులకు మంజూరైన నూతన ఆసరా కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం, ప్రాంతాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెలుగురి వలపు రెడ్డి, వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత, స్థానిక సర్పంచ్ గొర్ల సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.